మూడు నెలల్లోనే 13 వేల కోట్ల అప్పులు..!

-

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుండి స్పందన శూన్యం. కొందరు పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారు అని అన్నారు కడప YSR జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 13 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా ప్రభుత్వం ముందుకు పోతోంది అని అన్నారు.

అలాగే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీడీపీ నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేసుకున్నమా అని ప్రజలు బాధ పడుతున్నారు. గత ఎన్నికల్లో YSR కాంగ్రెస్ కు మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన YSR కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసేందుకు సిద్ధం అని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version