ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. క్లారిటీ ఇదే

-

 

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్.

పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ రోజే రూ.368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించామని ప్రకటించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version