వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ – కిషన్ రెడ్డి

-

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రకటన చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్ రెడ్డి. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది…ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గతంలో కూడా అదే టైం లో ఎన్నికలు వచ్చాయని…మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రులే జైలుకు వెళ్లారని..గత ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందని…గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు.

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదు…జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో BRS ప్రభుత్వం ఇబ్బంది పడిందని వెల్లడించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక చతికిల పడ్డది…కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. BRS గెలిచినా ఏమి చేయలేరు.. BRS కు ఓటు వేస్తే మూసిలో వేసినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version