ఈ నెల 15న వైరాలో సీఎం రేవంత్‌ బహిరంగ సభ..అదే రోజున 3వ విడత రైతు రుణమాఫీ

-

ఈ నెల 15న వైరాలో సీఎం రేవంత్‌ బహిరంగ సభ ఉండనుంది. ఖమ్మం వైరాలో ఈ నెల 15న సభలో పాల్గొని అనంతరం… సీతారామ లింకు కెనాల్ ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే.. సీఎం రేవంత్‌ రెడ్డి సభ ప్రాంగణము వైరా కేవీసీఎం కాలేజీ పక్కనగల స్థలాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే రామ్ దాస్, సిపి, కలెక్టర్.

Chief Minister A. Revanth Reddy had a meeting with expatriates in New Jersey

ఈ నెల ఆగస్టు 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మోటార్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ నెల 15న వైరా లో సియం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుంది. అదే రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్‌ బహిరంగ సభ ఉండనుంది. ఈ సభలోనే మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామ వైరా లింక్ కెనాల్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version