మెదక్ జిల్లాలో ఉద్రిక్తత.. తమ కుమారుడిని పొట్టన పెట్టుకున్నారంటూ..!

-

సాధారణంగా ఈ మధ్య కాలంలో భార్య, భర్తల మధ్య వివాదాలు చాలా ఎక్కువగానే తలెత్తుతున్నాయి. భార్య, భర్తల చిన్న చిన్న గొడవలు ప్రాణాల మీదికి వస్తున్నాయి. క్షణిక ఆవేశంలో భార్య చనిపోతే భర్తనే చంపాడని, అలాగే అత్తింటి వారు వేధించారని..  ఒకవేళ భర్త చనిపోతే భార్య మరియు అత్తింటి వారు కలిసి  తమ కుమారుడిని చంపారనే గొడవలు చేస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లె గ్రామంలో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి నిన్న ఉరేసుకొని మరణించారు. దీంతో ఇవాళ చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version