కేటీఆర్ సమక్షంలో BRS లొ చేరిన మునుగోడు నేత పాల్వాయి స్రవంతి

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు లో రాజ్ గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. కోట్ల రూపాయలు పెట్టీ మునుగోడు ప్రజలను కొనవచ్చు అని రాజ్ గోపాల్ రెడ్డి అనుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.

palvai-sravanti joined in brs

మునుగోడు విచిత్రమైన పరిస్థితి చూసామన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఎందుకు ఉప ఎన్నిక తెచ్చాడు అనేది ఆయనకే తెలవాలని చురకలు అంటించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరిన కాంగ్రెస్ పార్టీ కైనా తెలియాలని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్‌. పాల్వాయి గోవర్థన్ రెడ్డి అప్పట్లో ఏ పార్టీలోకి వెళ్ళను అని తేల్చి చెప్పారని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినప్పడు కాంగ్రెస్ నుంచి పోతున్నారు…వస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version