మహా న్యూస్ పై దాడి… పవన్ కళ్యాణ్ సీరియస్ !

-

మహా న్యూస్ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు గులాబీ పార్టీ నేతలు. అలాగే రెండు కార్లను.. కూడా ధ్వంసం చేశారు. ఫోన్ టాపింగ్ అంశంలో… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… గులాబీ పార్టీ నేతలు రెచ్చిపోయారు.

అయితే మహా న్యూస్ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం అన్నారు హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాన్.

ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news