ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ హస్తం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ లో అతని పాత్ర పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక లో అనేక విషయాలు ఉన్నాయన్నారు. శ్రవణ్ కుమార్ ను ప్రకటించబడ్డ నేరస్తుడిగా పరిగణించాలని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ కోరారు. ఫోన్ ట్యాపింగ్ తో శ్రవణ్ కుమార్ కు సంబంధం లేదని అతని తరపు న్యాయ వాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తికాగా.. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.