బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయింది – నరేంద్ర మోడీ

-

బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని ఫైర్ అయ్యారు.

Prime Minister Modi for Telangana today

మోడీ గ్యారెంటీ అంటే.. గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ ‘మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version