హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

-

హైదరాబాద్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై మోదీ స్పందించారు. ‘‘మాధవీలతా జీ. మీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. చాలా కీలక అంశాలను ఆమె ఇందులో లేవనెత్తారని, అవి ఎంతో తార్కికంగా ఉన్నాయని అన్నారు. ‘‘మీకు నా శుభాకాంక్షలు’’ అంటూ మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ పునఃప్రసారాన్ని అందరూ చూడాలని కోరారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొంపెల్ల మాధవీలతకు ఈ సారి బీజేపీ హైదరాబాద్‌ టికెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం వై-ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న మాధవీ లత.. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version