BREAKING : చంద్రబాబుపై తెలంగాణలో కేసు నమోదు !

-

చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది. హైదరాబాదులో చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించడంపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

నిన్న సాయంత్రం గన్నవరం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని నివాసం వరకు ర్యాలీగా వెళ్లిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా చంద్రబాబు కోసం అప్పటికే ఆయన నివాసంలో ఎదురుచూస్తున్న ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ఆయన వచ్చాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకునే అవకాశం ఉంది. ఇక అంతకుముందు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన చంద్రబాబుకు ఏపీ టీడీపీ నేతలు దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, పీతల సుజాత, బోడే ప్రసాద్‌, టీడీపీ కార్యకర్తలు వీడ్కోలు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version