జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి.. బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది – పొంగులేటి

-

జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కేసీఆర్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, జనాలు స్వచ్ఛందంగా వస్తారని ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని.. వాహనాల సీ బుక్‌లను అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని చెప్పారు. అవసరమైతే నేను రోడ్డు మీదకు వస్తానని వివరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కాగా, ఇవాళ ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ముఖ్యనేతలు హస్తం గూటికి చేరనున్నారు. వీరితోపాటు పొంగులేటి ముఖ్య అనుచరులు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version