బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో మంత్రి పొన్నం, మేయర్ అలక

-

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ పాల్గొన్నారు. ఈ ఇద్దరు మంత్రులు తమ భాగస్వాములతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే కల్యాణం సమయంలో మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అలకబూనారు.

ఏం జరిగిందంటే?.. అమ్మవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన సతీమణితో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఏర్పాట్లు చేశారు. అయితే ఆయనకు వెల్కమ్ చెప్పే సమయంలో ఓవైపు భక్తులు, మరోవైపు కార్యకర్తలు ఒకేసారి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టర్ అనుదీప్పై అసహనం వ్యక్తం చేశారు. కాసేపు అలిగి ఆలయం బయటే కూర్చున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version