దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి టెంపుల్!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పాతబస్తీలో చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

Preparations are being made to bring the Bhagyalakshmi temple under the purview of the Devadaya department

ఆలయ నిధులను ప్రస్తుత నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తీర్పు ఇచ్చినట్టు దేవాదాయశాఖ అధికార వర్గాల సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version