Priyanka Gandhi : ఈనెల 8న హైదరాబాద్ కు ప్రియాంకా గాంధీ

-

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 8న హైదరాబాద్‌ రానున్నారు. టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. వాస్తవానికి ఈనెల 5 లేదా 6న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు.

కానీ… సభ 8వ తేదీకి వాయిదా పడినట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈనెల 8తో ముగియనుంది. అక్కడి నుంచి దిల్లీకి తిరిగివెళ్తూ ఆమె హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ వస్తారన్న సమాచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

మరోవైపు రాష్ట్ర నాయకులు సరూర్​నగర్ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రియాంక హైదరాబాద్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ రాకతో తమ పార్టీలో సరికొత్త ఉత్సాహం రానుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version