రైతులకు శుభవార్త… పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టనున్న మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు.

ఫిబ్రవరిలో మహబూబాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అప్పటివరకు వేచి ఉండాలని, అర్హులు అందరికీ పట్టాలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version