బీజేపీలో చేరే వారికి రాజాసింగ్ హెచ్చరిక

-

బీజేపీలో చేరే వారికి రాజాసింగ్ హెచ్చరించారు. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాదిలో పెట్టుకోండి.. మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అని పేర్కొన్నారట. బీజేపీలో వచ్చే ముందు కొందరితో చర్చించి, ఆ తర్వాత చేరండి… నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరి, మళ్ళీ వెళ్లిపోయారో ఆలోచించండి అని వెల్లడించారు.

MLA Raja Singh makes sensational comments on the appointment of Telangana BJP state president
Raja Singh warns those joining BJP

బీజేపీలో చేరాక మీరు అనుకున్నది మీ నియోజకవర్గంలో జరగదు…. మీతో పాటు చేరిన కార్యకర్తలకు మీరు ఏ పదవి ఇప్పించలేరని స్పష్టం చేశారు రాజాసింగ్. మీకే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు… మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు.. మెల్లగా లాస్ట్ సీట్లోకి తోసేస్తారని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారు.. ఈరోజు కాకపోతే రేపైనా ఆ రాక్షసులు నాశనం అవుతారు అని హెచ్చరించారు రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news