ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 11 వరకు ఈ రైళ్ల సేవలు రద్దు

-

రైలు ప్రయాణికులకు అలర్ట్. ఈనెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ అధికారి తెలిపారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..

  • ఈనెల 24 నుంచి ఆగస్టు 10 వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, రాజమహేంద్రవరం-విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమహేంద్రవరం (07467) ప్యాసింజర్, విశాఖ-విజయవాడ (12717) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి (22707) డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
  • ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243) రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు, ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version