BREAKING : రిమాండ్ ఖైదీ రాములు మెదక్ సబ్ జైల్లో మృతి

-

మెదక్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీ భేటీ రాములు (45) మెదక్ సబ్ జైల్లో మృతి చెందాడు. ఈ నెల 2న హత్య యత్నం కేసులో రాములుకి రిమాండ్ విధించింది కోర్టు. అయితే తాజాగా రిమాండ్ ఖైదీ భేటీ రాములు కు ఛాతినొప్పి వచ్చింది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించింది జైలు సిబ్బంది.

అయితే అంతలోనే రాములు మరణించాడు. దీంతో రిమాండ్ ఖైదీ భేటీ రాములు (45) డేడ్ బాడీని మార్చురీకి తరలించారు. రిమాండ్ ఖైదీ భేటీ రాములు మరణం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని రిమాండ్ ఖైదీ భేటీ రాములు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version