గాంధీ భవన్‌లో తిట్టుకున్న రేవంత్, ఉత్తమ్ !

-

గత కొన్ని రోజులుగా రేవంత్, ఉత్తమ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళుతున్నారని రేవంత్‌ రెడ్డి సైన్యం దుష్పప్రచారం చేసింది. అయితే.. ఈ విషయంపై ఉత్తమ్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా గాంధీ భవన్‌లో రేవంత్, ఉత్తమ్ ఇద్దరూ తిట్టుకున్నారట. నిన్న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే తిట్టుకున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ కూడా గొడవకు దిగారట. వీరి గొడవ చూసి షాక్ అయిన కేసీ వేణుగోపాల్… వారికి వార్నింగ్‌ కూడా ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version