ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజా భవన్ గా మర్చుతాం !

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి… ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని… 80 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉందని ఆయన వివరించారు.

ప్రగతిభవన్ తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం మాత్రమేనని… అందులోకి అందరికీ అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ప్రగతి భవన్ లోకి ఈజీగా వచ్చేలా అనుమతులు ఇస్తామని తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు దుబ్బాక.. మధ్యాహ్నం 12.30 గంటలకు హుజూరాబాద్.. 2 గంటలకు మానకొండూర్.. 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్​లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్​.. 5 గంటలకు ముషీరాబాద్​లో ఏర్పాటు చేసే కార్నర్ మీట్​లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version