Rythu Bharosa Funds: తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలెర్ట్. రైతు భరోసా డబ్బులు నిన్న రాత్రి నుంచి జమ అవుతున్నాయి. 10 ఎకరాల వరకు ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది తెలంగాణ సర్కార్. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఎకరానికి రూ.12 వేలు చొప్పున.. ఒక్కో సీజన్కు రూ. 6వేలు జమ చేస్తూన్నారు.

చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న రెండు ఎకరాల లోపు రైతులకు డబ్బులు జమ చేశారు. నిన్న రెండు ఎకరాల లోపు ఉన్న 41,25,289 మంది రైతుల ఖాతాల్లో రూ 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 9 రోజులు తిరిగే లోపే 70,11,984 మంది రైతన్నలకు రూ.9 వేల కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.