Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం అర్హుల విషయంలో… కీలక ప్రకటన విడుదలైంది. అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తాజాగా స్పష్టం చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

ఈ పథకానికి అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో… 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు ఏపీ అధికారులు. సరైన వివరాలు లేని ఒకటి పాయింట్ 45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపింది ఏపీ వ్యవసాయ శాఖ. ఇక ఈనెల 20వ వరకు ఈ ప్రక్రియ పూర్తికానుందని తాజాగా… వెల్లడించడం జరిగింది. ఇక ఏపీ వ్యవసాయ అధికారులు ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రకటన చేయడంతో… రైతులు రిలాక్స్ అయ్యారు.