రేపటితో సర్పంచ్ ల పదవి కాలం క్లోజ్..మంత్రి పొన్నం కీలక ప్రకటన

-

రేపటితో తెలంగాణలో గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా.. సమర్థవంతంగా పాలించిన సర్పంచ్ లకు అభినందనలు తెలిపారు.

గ్రామ సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. తప్పకుండా అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గ్రామ సర్పంచ్ లు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ పదవీకాలాన్ని పొడగించాలని రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రత్యేక అధికారులను నియమించినా తాము విధులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి పై ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనరాబోతున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version