ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆర్థిక స్వావలంబనకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కల్పనకుగాను ఒక్కొక్కరికీ కనిష్ఠంగా రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని వాయిదా రూపంలో వారు తిరిగి చెల్లించాలి.

ఉన్నతి….డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ పథకం ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యం. ఇప్పుడు రుణ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊతం లభించనుంది.  ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో బడ్జెట్‌ నుంచి ఈ పథకానికి మరో రూ.250 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతమున్న రూ.250 కోట్ల నిధులకు ఇవి అదనంగా చేరితే రూ.500 కోట్ల మేర రుణాలను ఒక్క ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీలకు అందించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version