వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి గ్రీన్‌ సిగ్నల్‌

-

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ.

ఇటీవల ఆర్ ఎల్ సి సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అంగీకారం తెలిపింది. మెడికల్ బోర్డు నిర్వహించడంలో జాప్యంతో వయోపరిమితి 35 సంవత్సరాలు దాటడం తో ఉద్యోగం దొరకని వారికి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది సింగరేణి సంస్థ.

Read more RELATED
Recommended to you

Exit mobile version