తన మీద దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ రిప్లై..!

-

తన మీద దుష్ప్రచారం చేస్తే.. చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పొరిక బలరాం నాయక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ 9 మంది తెలంగాణ ఎంపీలు లోక్ సభలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఇటీవల జరిగిన లోక్ సభలో సమావేశాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు ఎంపీలు సమావేశాలకు హాజరు కాలేదు.. మరో నలుగురు ఎంపీలు హాజరైనా, ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ లోక్ సభ సమావేశాల్లో అసలు పాల్గొనలేదు.

మిగతా నలుగురిలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లోక్ సభ సమావేశాల్లో హాజరైనా ఒక్క ప్రశ్న వేయలేదని.. ట్విట్టర్ ఓ మీడియా సంస్థ పోస్ట్ చేసింది. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎంపీ బలరాం నాయక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version