నా గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం – తీన్మార్‌ మల్లన్న

-

నా గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం అంటూ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపు పత్రాన్ని తీన్మార్ మల్లన్నకు అందజేశారు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన.

teenmar mallanna

రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ తో గెలుపు కోటా (1,55,095) ఓట్లు సాధించారు తీన్మార్ మల్లన్న. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నా గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని… దానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version