ఈవీఎం ట్రబుల్.. రెజిమెంటల్ బజార్‌లో ప్రారంభం కాని ఓటింగ్

-

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటలు గంటలు క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ పోలింగ్ బూత్​లో ఇప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు.. అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అధికారులు ఈవీఎంకు మరమ్మతు చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో 219 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పోలింగ్ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. ఓటు వేసేందుకు తెల్లవారుజామునే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు ఈవీఎం మొరాయింపుతో గంటన్నర పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version