లోక్‌సభ స్థానాలకు BJP ఇన్‌ఛార్జుల నియామకం

-

పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌ఛార్జులను నియమించింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌కు రాజాసింగ్‌, సికింద్రాబాద్‌కు లక్ష్మణ్‌, నిజామాబాద్‌కు ఏలేటి మహేశ్వరరెడ్డి, చేవెళ్లకు ఏవీఎన్‌ రెడ్డి, నల్లగొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, జహీరాబాద్‌కు కాటిపల్లి వెంకటరమణరెడ్డి (కేవీఆర్‌), మెదక్‌కు పాల్వాయి హరీశ్‌బాబును ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నియమించారు.

లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు వీరే..
  • హైదరాబాద్‌- రాజాసింగ్‌
  • సికింద్రాబాద్‌- ఎంపీ లక్ష్మణ్‌
  • మల్కాజిగిరి- పైడి రాకేశ్‌ రెడ్డి
  • చేవెళ్ల- ఏవీఎన్‌ రెడ్డి
  • నిజామాబాద్‌- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
  • ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌ రెడ్డి
  • మహబూబాబాద్‌- గరికపాటి మోహన్‌రావు
  • పెద్దపల్లి- రామారావు పాటిల్‌
  • వరంగల్‌- మర్రి శశిధర్‌ రెడ్డి
  • కరీంనగర్‌- సూర్యనారాయణ గుప్తా
  • జహీరాబాద్‌- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
  • మెదక్‌- పాల్వాయి హరిబాబు
  • నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి
  • భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version