తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి నెలలో రెండు సార్లు సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి నెలలో మొదటి మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
అటు తెలంగాణ రాష్ట్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.