మహిళలు పోట్టి దుస్తులు వేసుకోవద్దు: MP మంత్రి

-

మహిళలు ధరించే దుస్తులపై ఎంపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మహిళలు పోట్టి దుస్తులు వేసుకోవద్దని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ హాట్ కామెంట్స్ చేశారు. కైలాష్ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారుతున్నాయి. రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో కైలాష్ విజయ్ వర్గీయ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా కైలాష్ మాట్లాడుతూ స్పీచ్ మహిళల గౌన్ లాగా చిన్నగా ఉంటేనే బాగుంటుందని వెస్ట్రన్ కంట్రీస్ లో అంటూ ఉంటారు.

Madhya Pradesh Minister Kailash Vijayvargiya
Madhya Pradesh Minister Kailash Vijayvargiya

దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. మన దేశంలో మహిళలను దేవతలుగా చూస్తారు. మహిళలు నిండుగా ఆభరణాలు, దుస్తులు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. పొట్టి పొట్టి దుస్తులు ధరించే వారిని నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను. మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తేనే చాలా బాగుంటుందని సంచలన కామెంట్లు చేశారు. కైలాష్ విజయ్ వర్గీయ మాట్లాడిన ఈ మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది మహిళలపై ఇలా మాట్లాడడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news