ప్రభుత్వ లాంఛనాలతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు

-

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ రాజీవ్‌రతన్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించిన అంతిమ సమస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్‌ రతన్‌ కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు.

హైదరాబాద్‌ శివారులోని మహేశ్వరం మండలం తుమ్మలూరులోని మ్యాక్‌ బీటీఆర్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్న రాజీవ్‌ రతన్‌.. ఆయన కుమారుడితో కలిసి మంగళవారం ఉదయం జాగింగ్‌ కోసం బయటికి వెళ్లగా.. 6.40 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. విపరీతమైన గుండెనొప్పితో బాధపడుతున్న ఆయనకు కుమారుడు సీపీఆర్‌ చేశారు. అనంతరం కొంతవరకు కోలుకుని మళ్లీ నొప్పి తీవ్రమవడంతో డ్రైవర్‌ను పిలిచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గుండెపోటుతో అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర పోలీస్‌ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజీవ్‌ రతన్‌కు పోలీస్‌ శాఖలో ముక్కుసూటి అధికారిగా పేరుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version