ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఏడారి అవుతుంది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ కు రూ.10వేల కోట్లు ఇచ్చారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పడం సరి కాదని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకవేళ ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే కనుక తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.

ఏపీకి పదే పదే ఇచ్చారని చెబుతున్నారని.. కనీసం కేంద్రానికి మీరు డీపీఆర్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గం కోడంగల్‌కు రూ.4 వేల కోట్లు ఇచ్చారని.. మరీ మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు మోడీకి తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చెయ్యాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఎడారి కావొద్దని ఏపీకి రూ. 15 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version