‘తెలుగు రైతుబడి’ రాజేందర్‌ రెడ్డికి అరుదైన అవకాశం

-

డిజిటల్‌ మీడియా వేదిక ద్వారా రైతులకు సమగ్ర సమాచారం అందిస్తున్న తెలుగు రైతుబడికి అరుదైన గౌరవం లభించింది. ఆ ఛానల్ నిర్వాహకుడు నల్గొండ జిల్లా వాసి జూలకంటి రాజేందర్‌రెడ్డిని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ దిల్లీ నిర్వహిస్తున్న ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ – 2024లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో యువతకు ఉన్న సరికొత్త అవకాశాలను చర్చించేందుకు రాజేందర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

ఈ నెల 15, 16వ తేదీల్లో దిల్లీ ఐఐఐటీలో ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్ -2024 కార్యక్రమం జరగనుంది. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ ఉత్తమ క్రియేటర్ల అవార్డుల్లోనూ వ్యవసాయ ఛానెళ్ల విభాగంలో తెలుగు రైతు బడి అత్యధిక ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఛానెల్లో రాజేందర్ రెడ్డి ఆధునిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సులభంగా లాభాలు అర్జించే విధానాలను రైతులకు వివరిస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version