తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు… లక్ష ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్శ్ అభియాన్ పథకం కింద గిరిజనులకు లక్ష ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 72,000 సహాయాన్ని… అందిస్తోంది.

మిగతా డబ్బులు తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. ఇందిరమ్మ ఇళ్ల నివాసానికి… ఒక్కో ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తోంది. ఇందులో కేంద్ర సహాయము కూడా ఉంటుంది. వాటి తో పాటు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు… అప్పు కూడా ఇస్తామని తాజాగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటించారు.