నిత్యం జనాల్లో ఉంటూ… ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ డైనమిక్ లీడర్ తలారి రాజ్ కుమార్ సేవలను అధిష్టానం గుర్తించింది. ఈ తరుణంలోనే ప్రజల కోసం నిత్యం ఆరాటపడే రాజ్ కుమార్ కు.. దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా కీలక పదవి కట్టబెట్టింది. ఇందులో భాగంగానే… బిజెపి పార్టీ కార్యదర్శి నియామక పత్రాన్ని.. మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా రాజ్ కుమార్ అందుకున్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన గండి మైసమ్మ చౌరస్తా శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో… వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా… దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా తలారి రాజ్ కుమార్ ఎంపికైన నేపథ్యంలో నియామక పత్రాన్ని అందజేశారు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బిజెపి పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉండి.. ఎన్నో గొప్ప విజయాలను అందుకుందని వెల్లడించారు. బిజెపి నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. తాజాగా ఎంపికైన నూతన మున్సిపల్ బిజెపి కమిటీ నాయకులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నిత్యం లీడర్లందరూ జనాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.
BJP పార్టీకి రాజ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు
ప్రపంచం లో అతిపెద్ద కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ (BJP) తరపున దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గా నన్ను ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు రాజ్ కుమార్. మన పార్టీ బలోపేతం కోసం నాకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా స్వీకరించి, నిర్వాహస్తానని తెలియ చేస్తున్నానన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు జిల్లా ఇంచార్జ్, అధ్యక్షులు శ్రీ Dr S.మల్లారెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసారి కృష్ణరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అద్యక్షులు గోనె మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ చారి, రాష్ట్ర ST మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, ఆకుల మల్లేష్, ప్రభాకర్ రెడ్డి, గీతాసెల్ అధ్యక్షులు శ్రీ వెంకటేష్, మల్లేష్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈదులకంటి నర్సింహ గౌడ్, వెంకటేష్ నాయక్,పిట్ల లక్ష్మణ్ ,డి.సీతారాం రెడ్డి,ఆకుల విజయ్ ,తురాయి భాను గౌడ్,తలారి రాము, తలారి శ్రీకాంత్, కొండా మహేష్, రంజిత్ గౌడ్, ఏలూరి శ్రీధర్ గౌడ్, ఆకుల యశ్వంత్, ఏలూరి విష్ణు, అనిల్ ముదిరాజ్ ,శ్రీకాంత్ ,గగిలాపూర్ చిన్న,నవీన్ ,నాగేంద్ర బాబు,కిరణ్,సాయి, సోను,మహేందర్,నిఖిల్ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
కార్యదర్శిగా ఎంపికైన రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు
దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా ఎంపికైన తలారి రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పారు బిజెపి నేతలు. పార్టీ బలోపేతానికి రాజ్ కుమార్ లాంటి సేవలు అవసరమని… ఆయన నిత్యం జనాల్లో ఉంటారని యంగ్ లీడర్లు స్పష్టం చేశారు.
తలారి రాజ్ కుమార్ కు మూడు పదవులు
నిత్యం జనాల కోసం పనిచేసే తలారి రాజ్ కుమార్ కు ఒకటి కాదు మొత్తం మూడు పదవులు దక్కాయి. దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా తాజాగా ఎంపికైన తలారి రాజ్ కుమార్… దుండిగల్ చత్రపతి శివాజీ కమిటీ జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. అలాగే దుండిగల్ గండి మైసమ్మ మండల బిజెపి సెక్రటరీగా కూడా తలారి రాజ్ కుమార్ కు ఇటీవలే పదవి దక్కింది. అనుక్షణం ప్రజల కోసం పరితపించే తలారి రాజ్ కుమార్… పనితీరు నేపథ్యంలోనే కీలక పదవులు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఆయన… పనిచేసి బిజెపి పార్టీని బలోపేతం చేస్తున్నారు. బిజెపి పార్టీని గ్రౌండ్ స్థాయికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు రాజ్ కుమార్.
గండి మైసమ్మ మండల బిజెపి సెక్రటరీగా బాధ్యతలు
గండి మైసమ్మ మండల బిజెపి సెక్రటరీగా కూడా రాజ్ కుమార్ తన సేవలను అందిస్తున్నారు. మొదటినుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ… పార్టీ బలోపేతానికి కృషిచేసి గండి మైసమ్మ మండల బిజెపి సెక్రటరీగా ఎదిగారు.
దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా దూకుడు
ప్రధాని నరేంద్ర మోడీని పూర్తిగా తీసుకొని.. రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న రాజ్ కుమార్…దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఏ పదవి ఇచ్చిన సరే… అణిగి మణిగి ఉండడం… పార్టీ కోసం కొట్లాడే తత్వం ఉన్న రియల్ లీడర్ రాజ్ కుమార్. అందుకే ఆయనకు ఒకటి కాదు ఏకంగా మూడు పదవులు రావడం గమనార్హం. ఇలాగే అంచలంచెలు గా ఎదిగి… భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కార్యకర్తలు, ఆయన శ్రేయోభిలాషులు కోరుతున్నారు.