శారీరక సుఖం కోసం రాత్రికి తెచ్చుకున్న మహిళను చంపిన యువకుడు

-

రూ. 5 వేల రూపాయల కోసం తనతో శారీరక సంబంధం కోసం తెచ్చుకున్న మహిళని బండరాయితో కొట్టి చంపిన ఘటన మీర్ పేట్ లో కలకలం సృష్టించింది.మహబూబ్ నగర్ కి చెందిన జర్పుల మంజ నాయక్ అనే వ్యక్తి ఈ నెల 24న అర్ధరాత్రి నిందితుడు ఐఎస్ సదన్ వద్ద నిల్చుని ఉన్న అనురాధ అనే మహిళ వద్దకు వెళ్లి తనతో శారీరక సంబంధం లో పాల్గొనాలని చెప్పి రూ. 1000 రూపాయలు కి మాట్లాడి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.

ఆ రాత్రి అక్కడే ఉన్న ఇద్దరు ఉదయం అనురాధ వెళ్లే సమయంలో నిందితుడు మంజ నాయక్ పర్సు లో ఉన్న 5000 రూపాయలు దొంగిలించి వెళ్ళిపోతుండగా గమనించిన నిందితుడు డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో ఆమెని వెంబడించి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోకాయుక్త కాలనీలో ఆ మహిళ తలపై గ్రానైట్ రాయితో కొట్టటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించి దార్పుల మంజా నాయక్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version