Ipl 2022 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 43వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే… ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది గుజరాత్.

జట్ల వివరాలు :

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్(w), షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version