BREAKING : హుజూరాబాద్‌లో టిప్పర్ బోల్తా.. అందులోని మట్టి పడి ముగ్గురు మృతి

-

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ బోల్తా పడటంతో అందులో ఉన్న మట్టి మీద పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో బయల్దేరిన ట్రక్కు బోర్నపల్లి మూల మలుపు వద్ద డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. వెంటనే వారిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విజయ్‌, సింధుజ ఇద్దరు మృతి చెందారు. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులు బోర్నపల్లికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. వారంతా పెద్దమ్మ బోనాల జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version