రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసివేయనున్నారు.

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తామని అదనపు సీపీ తెలిపారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version