సరంపేట లోనే టిఆర్ఎస్ కి అత్యధిక మెజారిటీ !

-

మునుగోడు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది. మొదటి మూడు రౌండ్లలో బిజెపి ఆదిత్యం కనబరిచినప్పటికీ.. ఈ పోరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విజయం సాధించారు. అయితే.. సీఎం కెసిఆర్ ఇంఛార్జిగా ఉన్న మునుగోడు లోని సరంపేటలో టిఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎమ్మెల్సీ పోచంపల్లి నేతృత్వంలో గజ్వేల్ నాయకులు ఇక్కడ ఎన్నిక ప్రచార బాధ్యతలు చూశారు.

సరంపెటలో మొత్తం 1082 ఓట్లు ఉండగా 998 పోలయ్యాయి. ఇందులో టిఆర్ఎస్ కు 666.. ఓట్లు వచ్చాయి. BJP కి 209.. కాంగ్రెసుకు 43 పడ్డాయి. 15 రౌండ్లలో కౌంటింగ్ జరగగా సరంపేట ఉన్న 12రౌండ్ లో TRS కు అత్యధికంగా 2 వేల మెజారిటీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు,ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version