జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. 18 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా, యాంకర్ గా పనిచేసిన స్వేచ్ఛ తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ స్వేచ్ఛ తండ్రి శంకరన్న ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల నుంచి స్వేచ్ఛ తన కూతురితో కలిసి పూర్ణచందర్ తో ఉంటుందని శంకరన్న అన్నారు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లుగా శంకరన్న అన్నారు.
ఈ క్రమంలోనే స్వేచ్ఛ తనకి ఫోన్ చేసి అతడితో ఉండలేకపోతున్నానని చెప్పినట్లుగా శంకరన్న అన్నారు. ఇంతలోనే తన కూతురు మరణించిందని శంకరన్న అన్నారు. ఈ క్రమంలోనే స్వేచ్ఛ తల్లి తన కూతురి మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డను ఎవరో ప్లాన్ ప్రకారం చంపి వేలాడదీసినట్లుగా అనిపిస్తుందని స్వేచ్ఛ తల్లి అన్నారు. ఈ విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేశామని స్వేచ్ఛ తల్లి అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. స్వేచ్ఛ చాలా మేధావి, పోరాట యోధురాలు. ఎలాంటి సమస్య వచ్చిన తన సమస్యను తానే పరిష్కరించుకుంటానని చెప్పేదని స్వేచ్ఛ తల్లి అన్నారు. అందరికీ ధైర్యం చెప్పే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ స్వేచ్ఛ తల్లి ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.