భద్రాద్రి రాముడినీ దృష్టిలో పెట్టుకోండి..బీజేపీపై విజయశాంతి సెటైర్లు

-

బీజేపీపై విజయశాంతి సెటైర్లు పేల్చారు. జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వాక్యాలు చేశారు. ‘దేశ ప్రజలు అయోధ్య రాముడిని ఎంత అభిమానిస్తారో…. మా భద్రాద్రి రాములవారిని అంత విశ్వసిస్తారు.

Vijayashanthi satires on BJP

ఇక్కడ శ్రీరాముని సందర్శన కూడా భక్తి భావోద్వేగాలతో కూడుకున్నదే. తెలంగాణకు ఎన్నోసార్లు వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’ అని ట్వీట్ చేశారు. కాగా, జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version