Telangana: ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి మధ్య వార్‌ ?

-

Uttam Kumar Reddy vs Komati Reddy: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లానున్నారు. ఎల్లుండి (జూలై 4 న) క్యాబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్‌ ఉందని సమాచారం. కొత్తగా మంత్రివర్గంలో నలుగురికి చోటు దక్కనుందట. హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం వస్తుందని చెబుతున్నారు. ఒక పత్రికా సంపాదకుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

War between Uttam Kumar Reddy vs Komati Reddy

దీంతో ఢిల్లీలోనే మకాం వేశారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకవేళ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరిని క్యాబినెట్లోకి తీసుకోవాలంటున్నారట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే విషయం ఢిల్లీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం అందుతోంది. దీంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్‌ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వార్‌ నెలకొందని సమాచారం. మరి ఎవరికి ఛాన్స్‌ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version