బీఆర్ఎస్ ఏం చేసిందని ఓటు వేయాలి : బండి సంజయ్ 

-

తెలంగాణలో ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్న నేపథయంలో పలు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల నగరా మోగిన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకి మొదటిసారిగా పర్యటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇవాళ ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు బండి సంజయ్. ఇప్పటి వరకు ఒక్క గ్రూపు 1 నోటిఫికేషన్ వేయలేదు. వేసిన ఒక్క నోటిఫికేషన్ రెండు సార్లు రద్దు అయింది. యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. మోడీ రాజ్యం రావాలా..? ఎంఐఎం రాజ్యం రావాలని ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒరిగింది ఏమి లేదన్నారు. ఇంకా మిగిలింది అని..  50 రోజులు మాత్రమే అని.. ఈ 50 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version