దిల్ రాజు పై ట్రోల్స్ చేస్తున్న తెలుగు ఫ్యాన్స్..కారణం..?

-

ఈ మధ్యకాలంలో దిల్ రాజు కొంచెం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు అనే వార్తలు బాగా వైరలవుతున్నాయి. అసలు కారణంలోకి వెళ్తే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం వారసుడు.. తమిళ స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడిన మాటలకు.. తెలుగు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది.

తెలుగు స్టేట్స్ లో తమిళ స్టార్ హీరో విజయ్ ను లేపేందుకు తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు మాట్లాడుతూ..” నేను విజయ దళపతి క్యాబిన్లో వెయిట్ చేస్తున్నాను . క్యాబిన్లోకి వచ్చిన విజయ్ స్వయంగా తానే మాకు కాఫీ కప్పులు ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విజువల్ ఇప్పటికీ నా మదిలో ఉంది. తెలుగులో మెగాస్టార్లు , సూపర్ స్టార్లతో సినిమాలు చేశాను. కానీ అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు” అంటూ కామెంట్స్ చేశారు.

అయితే తెలుగు హీరోలను తక్కువ చేస్తూ కోలీవుడ్ హీరోలను పైకి లేపే ప్రయత్నంలో ఇలాంటి కామెంట్లు చేయడం ఏమాత్రం సబబుగా లేదు అని… తిన్నింటివాసాలనే లెక్క పెడతావా అంటూ కూడా రకరకాలుగా ఈయనపై కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఆయన ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version