అది మీ చేతకానితనం.. భారత ప్రభుత్వంపై పాక్ క్రికెటర్ సంచలన విమర్శలు

-

జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించగా..అందులో మరో ఇద్దరు విదేశీ పర్యాటకులు సైతం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.

ఆ దేశానికి సింధు జలాలను నిలిపివేసింది. పాక్ పౌరులకు వీసాలను సైతం రద్దు చేసింది. పాక్ పౌరులు దేశాన్ని వీడాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ ఉగ్రదాడి మీద పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘100% భారత్ సైన్యం ఫెయిల్యూర్.. చేతకాని తనం వల్లే ఉగ్రదాడి జరిగింది. మేము దాడులు చేస్తే.. మీ భారత కబడ్డీ జట్టు మా పాకిస్తాన్‌కు వచ్చి ఎలా ఆటలు ఆడుతుంది?’ అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news