బుద్దా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తాం – వైసీపీ నేత

-

బుద్దా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తామని వార్నింగ్‌ ఇచ్చారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. వెనుకబడిన అగ్రకుల విద్యార్థులకు విదేశీ విద్య దీవెనతో సీఎం జగన్ వరం ఇచ్చారని.. గత ప్రభుత్వంలో కాకుండా ఎక్కువ మందికి విదేశీ విద్యా వర్తించేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 6 లక్షల వార్షిక ఆదాయం నిబంధన పెడితే.. సీఎం జగన్ 8 లక్షల వరకూ అవకాశమిచ్చారని.. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ వెన్నులో వణుకు పుడుతుందని వెల్లడించారు.

పథకాల పై టీడీపీ, జనసేన పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని… చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ను పట్టించుకోలేదు.. కార్పొరేషన్ పేరుతో ఇష్టం వచ్చినట్టు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. డబ్బులున్న పిల్లలు కూడా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్ళారని.. కొంత మంది విదేశాలు వెళ్లకుండా డబ్బులు కాజేసారని ఆగ్రహించారు.

పవన్ పొలిటీషియన్ కాదు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే క్యారెక్టర్ ఆర్టిస్టు… తాను కాపునని చెప్పుకోలేని పవన్ కూడా కాపుల గురించి మాట్లాడుతున్నాడని నిప్పలు చెరిగారు. పార్టీ పవనుది అయినా నడిపించేది నాదెండ్ల మనోహర్… పక్కనే ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వెయ్యని పవనుకి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు హయాంలో కాపులు అనేక ఇబ్బందులు పడ్డారు.. అప్పుడు పవన్ ఏమయ్యాడు..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version