కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి వేస్తే నరికేస్తాం – కోమటిరెడ్డి సంచలనం

-

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చెయ్యేస్తే ఆ చేయిని నరికేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వెంకటరెడ్డి తెలిపారు.

దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయి అని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అన్ని మర్చిపోతారు అని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కెసిఆర్ అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదని.. గ్రామ స్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలే లేరని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version